England Tour of India : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship) మూడో దశలో భారత జట్టు, ఇంగ్లండ్(England)ను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్(Test Series) షెడ్యూల్ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్కు రానుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium) వేదికగా ఇరుజట్లు జనవరి 25న తొలి టెస్టు ఆడనున్నాయి.
రెండో టెస్టు విశాఖపట్నంలో ఫిబ్రవరి 2న మొదలవ్వనుంది. రాజ్కోట్లో ఫిబ్రవరి 15న మూడో మ్యాచ్. రాంచీలో ఫిబ్రవరి 23న నాలుగో టెస్టు, ఆఖరి టెస్టు ధర్మశాల వేదికగా మార్చి 7న జరుగనున్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటన(West indies Tour)లో ఉన్న భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్తో మూడు టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఇండియాలో కాలుమోపనుంది. సెప్టెంబర్ 22న మొహాలీలో మొదటి వన్డే జరుగుతుంది. 24వ తేదీన ఇండోర్లో రెండో వన్డే, 27న రాజ్కోట్ వేదికగా మూడో వన్డేలో భారత్, ఆసీస్ తలపడుతాయి.
ఆస్ట్రేలియా, భారత జట్టు
అక్టోబర్ 5న వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023) షరూ కానుంది. దాంతో, ప్రపంచ కప్ తర్వాత ఇరుజట్లు నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3వ తేదీన టీ20లు ఆడుతాయి. ఆ వెంటనే భారత్, అఫ్గనిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగనుంది. ఇరుజట్లు మూడు టీ20 ఆడనున్నాయి. 2024 జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమిండియా 2023-24 సీజన్లో సొంతగడ్డపై 16 మ్యాచ్లు ఆడనుంది. వాటిలో 5 టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి.