మిర్పూర్: భారత్, బంగ్లాదేశ్ జట్లు వన్డే వార్కు సిద్ధమయ్యాయి. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. వచ్చే ఏడాది స్వదేశం వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ముఖ్యంగా టాపార్డర్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ బరిలోకి దిగుతారా లేక సీనియర్ ధవన్కు అవకాశమిస్తారా అన్నది చూడాలి.
కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్తో మిడిలార్డర్ పటిష్ఠంగా కనిపిస్తున్నది. సీనియర్ స్పీడ్స్టర్ మహ్మమద్ షమీ గాయపడటంతో జమ్ము కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు చోటు కల్పించారు. మరోవైపు తమీమ్ ఇక్బాల్ గైర్హాజరీలో లిటన్ దాస్ బంగ్లా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ పేసర్ తస్కీన్ అహ్మద్ లేకుండానే బంగ్లా బౌలింగ్ దాడికి దిగనుంది. మ: 11.30 నుంచి సోనీ నెట్వర్క్లో