భారత్-జింబాబ్వే జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. సిరీస్లో ఫేవరెట్గా బరిలో దిగుతున్న భారత్ను తాము ఓడిస్తామని జింబాబ్వే బ్యాటర్ ఇన్నొసెంట్ కాయా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. భారత్పై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుస్తామని కాయా అంటున్నాడు.
‘మేం ఈ సిరీస్ గెలుస్తాం. ఇక వ్యక్తిగత ఎక్స్పెక్టేషన్స్ విషయానికొస్తే.. నేను సెంచరీలు చేసి, టాప్ స్కోరర్గా నిలవాలని అనుకుంటున్నా’’ అని కాయా వెల్లడించాడు. ఇంటీవలే బంగ్లాదేశ్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లు రెండింటిలోనూ జింబాబ్వే అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. బంగ్లా టైగర్స్ను ఓడించి రెండు సిరీసులనూ తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేలో భారత పర్యటన ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుంది.