IND vs WI | కోల్కతా వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే తొలి వికెట్ ఇషాన్ కిషన్ (2) ను కోల్పోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ ( 19), సూర్య కుమార్ యాదవ్ (9) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యారు. కానీ విరాట్ కోహ్లీ (52), రిషబ్ పంత్ (52) చెరో హాఫ్ సెంచరీతో టీమిండియాను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. వీళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (33) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి టీమిండియా 186 పరుగులు చేయగలిగింది.