వెస్టిండీస్తో శుక్రవారం నాడు ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆ దేశం చేరింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. జట్టు సారధి శిఖర్ ధావన్, సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సిరాజ్, శ్రేయాస్ అయ్యర్ తదితరులంతా అక్కడకు చేరుకున్నారు.
ఇక్కడ భారత జట్టు ఈ నెల 22 నుంచి 27 వరకు మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ సారధ్యంలో 5 టీ20లు ఆడనుంది. ఈ రెండు సిరీసులక కోహ్లీ, బుమ్రా వంటి వెటరన్లకు విశ్రాంతినిచ్చారు. విండీస్ కూడా వన్డే సిరీస్ కోసం 13 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించింది. వెటరన్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్2కు మళ్లీ పిలుపునిచ్చింది.
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022