ఇప్పుడిప్పుడే బ్యాటింగ్లో వేగం పెంచుతున్న కేఎల్ రాహుల్ (49) అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో చిన్న పొరపాటు కారణంగా రాహుల్ పెవిలియన్ చేరాడు. భారత జట్టు స్కోరు 134 పరుగుల వద్ద కీమర్ రోచ్ బౌలింగ్ చేస్తున్నాడు.
30వ ఓవర్ నాలుగో బంతిని డీప్ కవర్స్లోకి పంపిన రాహుల్ రెండో పరుగు కోసం వస్తూ.. దేనికో తెలియదు కానీ ఒక్క క్షణం అలా ఆగాడు. ఈ క్షణమే అతని కొంప ముంచింది. బంతి అందుకున్న హొసేన్ నేరుగా కీపర్ హోప్ చేతుల్లోకి వేయడంతో.. రాహుల్ రనౌట్ అయ్యాడు. పెవిలియన్కు వెళ్లే సమయంలో సూర్యకుమార్పై రాహుల్ అసంతృప్తి ప్రకటించాడు.
కానీ అక్కడ సూర్య ఎటువంటి పొరపాటు చేయకపోవడం గమనార్హం. అయితే పెవిలియన్కు వెళ్లే సమయంలో బౌండరీ లైన్ దాటేటప్పుడు రాహుల్ తన వీపు పట్టుకొని వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. అది గమనించిన ఫిజియో కూడ రాహుల్ వెనకే వెళ్లాడు.