తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఆదివారం పాక్ చేతిలో పరాభవం తర్వాత ఫైనల్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలోనే మంగళవారం దుబాయ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ దాసున్ శనక తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
పాక్తో మ్యాచ్లో కూడా టాస్ ఓడిన భారత్.. లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పులూ లేవని శనక చెప్పాడు. అదే సమయంలో భారత జట్టులో ఒకే ఒక మార్పు చేశామని, బిష్ణోయి స్థానంలో అశ్విన్ను తీసుకున్నామని రోహిత్ వెల్లడించాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్
శ్రీలంక: పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ ఆశలంక, దనుష్క గుణతిలక, దాసున్ శనక (కెప్టెన్), భానుక రాజపక్స, వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, అశిత ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక
One change in the #TeamIndia Playing XI.
R Ashwin comes in for Ravi Bishnoi.
Live – https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/yxZoLWYHTe
— BCCI (@BCCI) September 6, 2022