మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనుంది. ఇక్కడ టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో భారత్తో టీ20 మ్యాచులు ఆడే లంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 18 మందిని ఎంపిక చేసింది. ఈ టీ20 జట్టుకు దాసున్ షానక నాయకత్వం వహిస్తాడు. అతని డిప్యూటీగా చరిత్ ఆశలంక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
అలాగే ఆస్ట్రేలియాతో తాజాగా ముగిసిన టీ20 సిరీస్లో లంక తరఫున ఆడిన అవిష్క ఫెర్నాండో, నువాన్ తుషార, రమేష్ మెండిస్ భారత్తో సిరీస్కు దూరమయ్యారు. వీళ్లు ముగ్గురు గాయాల కారణంగా భారత్ రావడం లేదని శ్రీలంక బోర్డు తెలిపింది. కరోనా సోకడంతో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మూడు టీ20లకు దూరమైన వానిందు హసరంగ భారత సిరీస్కు ఎంపికయ్యాడు.
అతనితోపాటు మరో యువ స్పిన్నర్ ఆషియన్ డానియల్ను కూడా ఎంపిక చేశారు. అయితే మినిస్టీరియల్ అనుమతిని బట్టి అతను ఆడేది లేనిదీ తేలనుంది.
భారత్లో పర్యటించే శ్రీలంక జట్టు: దాసున్ షానక (కెప్టెన్), పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ ఆశలంక, దినేష్ చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్ మిషార, జనిత్ లియానగే, వానిందు హసరంగ, చామిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరాన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్క్రమ, ఆషియన్ డానియల్ (మినిస్టీరియల్ అనుమతిని బట్టి).
Sri Lanka announces its squad for the T20I series against India.#SriLanka #SL #INDsSL #SriLankaCricket #SriLankaCricketTeam #CricTracker pic.twitter.com/hTi5TDuviM
— CricTracker (@Cricketracker) February 21, 2022