తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్న మయాంక్ అగర్వాల్ (22).. రెండో ఇన్నింగ్స్లో కూడ నిరాశపరిచాడు. రోహిత్తో కలిసి శుభారంభం ఇచ్చినట్లే కనిపించిన మయాంక్.. ఎంబుల్డెనియా వేసిన బంతిని అనవసరంగా ఆడాడు. అయితే ఆ బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. కంఫర్టబుల్గా స్లిప్స్లో ఉన్న డిసిల్వ చేతుల్లోకి వెళ్లింది.
దీంతో మయాంక్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోసారి మంచి ఆరంభం లభించినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో మయాంక్ విఫలమయ్యాడు. కర్ణాటకకే చెందిన మయాంక్ సెంచరీ కోసం ఎదురు చూస్తున్న బెంగళూరు అభిమానులు కూడా అతను అవుటవడంతో నిరాశ చెందారు. మయాంక్ అవుటవడంతో హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు.