భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే (107) ఇన్నింగ్స్కు ముగింపు. స్టార్ పేసర్ బుమ్రా అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన ఫాస్ట్ డెలివరీ చాలా లైట్ మూవ్మెంట్తో వచ్చింది. దాన్ని డ్రైవ్ చేయడానికి కరుణరత్నే ప్రయత్నించాడు. కానీ సరిగా వేగం అందుకోలేకపోయాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి వికెట్లకు తగిలింది.
ఆనందంతో బుమ్రా గాల్లో పంచులు విసిరాడు. అయితే చిన్నస్వామి స్టేడియం మొత్తం కరుణరత్నేకు చప్పట్లతో వీడ్కోలు పలికింది. మరుసటి ఓవర్లోనే అశ్విన్ మరో వికెట్ కూల్చాడు. లసిత్ ఎంబుల్డెనియా (2)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వేసిన స్టెయిట్ డెలివరీని డిఫెండ్ చేసేందుకు ముందుకు వచ్చిన ఎంబుల్డెనియా బంతిని మిస్ చేశాడు.
అతని ప్యాడ్లకు బంతి తగలగానే భారత ఆటగాళ్లు అప్పీలు చేశారు. కానీ అంపైర్ అవుటివ్వలేదు. దాంతో రోహిత్ వెంటనే రివ్యూ కోరాడు. అది అవుటని తేలడంతో భారత శిబిరం సంతోషంలో మునిగిపోయింది.