శ్రీలంకతో సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్కు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పేసర్ చాహర్కు గాయం కావడంతో అతను లంక సిరీస్ ఆడటంపై ఇప్పటికే అనుమానాలు నెలకొన్నాయి. కానీ సూర్యకుమార్ విషయంలో ఎటువంటి అనుమానాలూ కలగలేదు. విండీస్తో జరిగిన మూడో టీ20ల ఇరగదీసిన సూర్యకుమార్.. లంకపై కూడా మెరుపులు మెరిపిస్తాడని అంతా భావించారు. కానీ ఆ మ్యాచ్లో ఫీల్డింగ్ సమయంలో సూర్యకు చిన్న గాయమైందని బీసీసీఐ తెలిపింది.
దీంతో వీళ్లిద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకుంటారని ప్రకటించింది. వీరి స్థానాలను భర్తీ చేసేందుకు ఎవరి పేర్లూ ప్రకటించలేదు. దీంతో లంక సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల బృందం.. ఇప్పుడు 16 మంది సభ్యుల బృందంగా మారింది. ఈ టోర్నీ నుంచి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్లకు ఇప్పటికే విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఈ సిరీస్కు అందుబాటులో లేడు.
కాగా, లంక బౌలర్ వానింది హసరంగ కూడా కరోనా నుంచి పూర్తిగా కోలుకోలేదని, అతను భారత్తో సిరీస్లో ఆడటం లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ప్రకటించింది. భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ గురువారం జరగనున్న సంగతి తెలిసిందే.
🚨 UPDATE 🚨: Deepak Chahar and Suryakumar Yadav ruled out of @Paytm #INDvSL T20I Series. #TeamIndia
More Details 🔽
— BCCI (@BCCI) February 23, 2022