దుబాయ్: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే హిట్ మ్యాన్ రోహిత్ (0) వికెట్ కోల్పోయిన భారత జట్టు మూడో ఓవర్లోనే ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ (3) వికెట్ కూడా కోల్పోయింది.
ఈ రెండు వికెట్లు కూడా పాక్ పేసర్ షాహిన్ అఫ్రిదీనే తీశాడు. తన తొలి ఓవర్లో రోహిత్ను బోల్తా కొట్టించిన అఫ్రిదీ, రెండో ఓవర్లో ప్రమాదకర రాహుల్ను బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతోపాటు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.