ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్భుతమైన ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు.
అతనితోపాటు జడేజా (83 నాటౌట్) కూడా రాణించాడు. శార్దూల్ ఠాకూర్ (1) కూడా విఫలమయ్యాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులతో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 3, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీయగా.. బెన్స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసుకున్నారు.