ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆడే 11 మందిలో ఎవరు తప్పుకుంటారనే చర్చ మొదలైంది. దీనిపై మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు.
రోహిత్ జట్టుతో కలిశాడు కాబట్టి.. రుతురాజ్ తన స్థానం కోల్పోతాడని అతను అంచనా వేశాడు. అదే సమయంలో సంజూ శాంసన్కు మరో అవకాశం దక్కుతుందా? అని ప్రశ్నించాడు. డెర్బీ షైర్తో జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్లో రుతురాజ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు.
అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్లో కూడా రుతురాజ్ ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచుల్లోనూ ఓపెనింగ్ చేసిన అతను ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదే సమయంలో జట్టులో అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ సత్తా చాటుతుండటంతో రుతురాజ్ స్థానం ప్రమాదంలో పడింది.