ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. గిల్, పుజారా, విహారి విఫలమైనా కోహ్లీ (11) మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది అతను కూడా నిరాశ పరిచాడు. పాట్స్ వేసిన బంతిని వదిలేయడానికి ప్రయత్నించిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు.
దాంతో బ్యాటు చివరన తగిలిన బంతి వికెట్లను కూల్చింది. అతని వికెట్ తీసిన ఆనందంలో ఇంగ్లండ్ జట్టు సంబరాల్లో మునిగిపోగా.. కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు.