జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి అద్భుతమైన ఆటతో ఆదుకున్న రిషభ్ పంత్ (146) అవుటయ్యాడు. జో రూట్ వేసిన ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన పంత్.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వచ్చిన బంతిని బౌండరీ దాటించేందుకు ప్రయత్నించిన పంత్ మిస్సయ్యాడు.
దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్లో ఉన్న క్రాలీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది. 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 320 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.