భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ చేస్తున్నామని చెప్పాడు. గత రెండు మ్యాచుల్లోనూ ఛేజింగ్ చేయలేక ఇంగ్లండ్ చతికిలపడిన విషయం తెలిసిందే. ట్రెంట్ బ్రిడ్జ్లో పిచ్ బ్యాటింగ్కు పూర్తిగా సహకరిస్తుంది.
ఇక్కడ ఇంతకుముందు భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ కారణంగానే ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అలాగే తమ జట్టులో పార్కిన్సన్, శామ్ కర్రాన్ ఆడటం లేదని.. వారి స్థానంలో సాల్ట్, టాప్లే జట్టులో చేరుతున్నారని బట్లర్ వెల్లడించాడు. అలాగే తమ జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు రోహిత్ శర్మ కూడా చెప్పాడు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చాహల్ ఆడటం లేదని వారి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయి ఆడుతున్నారని తెలిపాడు.
ఇంగ్లండ్ జట్టు: జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్), డేవిడ్ మలాన్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, మొయీన్ అలీ, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, రీస్ టాప్లే
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయి
England have won the toss and elect to bat first in the third and final T20I.
A look at #TeamIndia Playing XI for the game.
Live – https://t.co/BEVTo51IKg #ENGvIND pic.twitter.com/JHHMW1TInu
— BCCI (@BCCI) July 10, 2022