HomeKarimnagarBrs Candidate For Parliament Vinod Kumar Unveiling The Posters Created In The Name Of Vinodanna Bharosa For The Development Of Karimnagar
బండి గుడి తేలే.. బడి తేలే ఐదేండ్లలో ఏం చేసిండు?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఒక గుడితేలేదని, బడితేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
ఏమీ చేయని ఆయనకు ఓటెందుకు వేయాలి
అభివృద్ధి చేసేవారినే గెలిపించాలి
కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, మే 2: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఒక గుడితేలేదని, బడితేలేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఐదేండ్లల్లో ఏం చేసిండని నిలదీశారు. మత రాజకీయాలతో పబ్బం గడుపుతూ, దేవుడి పేరుతో ఓట్ల బిచ్చం అడుక్కోవడం తప్ప ఆయనకు ఏమీ తెలియదని విమర్శించారు. ఏమీ చేయని ఆయనకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్ను అభివృద్ధి చేసిన వారికి, అభివృద్ధి ఆలోచనలు చేసే వారికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తనకు అవకాశమిస్తే తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని స్పష్టం చేశారు.
కరీంనగర్లోని యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రతి ఆరు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, సింగపూర్లోని ఐటీఈ తరహాలో టెక్నికల్ ఇనిస్టిట్యూట్ను, ఐటీ ఇంక్యూబెటర్ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఇనిస్టిట్యూట్తో యువ త వివిధ అంశాల్లో పూర్తి స్థాయిలో నైపుణ్యం సాధించే అవకాశముంటుందని, ప్రైవేట్ రంగం లో ఉపాధి అవకాశాలు పొందవచ్చని సూచించారు. గురువారం ఉదయం కరీంనగరంలోని మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో మార్నింగ్ వాక్ చేసి, ప్రచారం చేశారు. తిమ్మాపూర్ మండలం పోరండ్ల, మన్నెంపల్లిలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్ వద్ద ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో ప్రచారం చేశారు.
ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏయే అభివృద్ధి పనులు చేస్తామన్న వివరాలతో బీఆర్ఎస్ రూపొందించిన ‘కరీంనగర్ అభివృద్ధికి వినోదన్న భరోసా’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయా చోట్ల వినోద్కుమార్ మాట్లాడారు. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న టైంలోనే కరీంనగర్ను స్మార్ట్సిటీలో చేర్చి రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. ఆ నిధులతోనే ఇప్పటికీ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. వీటితో పాటు కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైల్వే లైన్ మంజూ రు చేయించడంతో పాటుగా ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించినట్లు గుర్తుచేశారు. మరో ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తయి కరీంనగర్కు రైలు వస్తుందని వివరించారు. ఇప్పటికే ఎల్ఎండీ సమీపంలో ఐటీ టవర్ను తీసుకువచ్చామన్నారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం, ప్యాకేజింగ్ టైక్స్ టైల్ పార్క్ తదితర ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తనను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా నిధులు తెచ్చి మరీ, మరీ కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీ లు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పా రు. ఈ పార్లమెం ట్ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదని హెచ్చరించా రు. ఆయన వెంట ప్రచారంలో మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, మాజీ మేయర్ రవీందర్సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు కోల మాలతి, గందె మాధ వి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్హుస్సేన్, నాయకులు గందె మహేశ్, అర్ష మల్లేశం, ప్రశాంత్రెడ్డి, పవన్, రాజేందర్ ఉన్నారు.