భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లిష్ బ్యాటర్లు జో రూట్ (9 నాటౌట్), ఓలీ పోప్ (10) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆడారు. కానీ పోప్ను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. ఊరించేలా బుమ్రా వేసిన బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన పోప్ ఫెయిలయ్యాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్స్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ వైపు వెళ్లింది. దాన్ని అందుకోవడానికి తడబడిన అయ్యర్.. రెండో ప్రయత్నంలో ఒడిసి పట్టేశాడు. దాంతో పోప్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 44 పరుగులకే ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోగా.. మూడూ బుమ్రానే తీయడం గమనార్హం.