IND vs ENG 1st Test: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్. ఆట మొదటిరోజు భారత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ను ఇంగ్లండ్ పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్ ఔట్ చేశాడు. రెండో రోజు ఆట మొదలవ్వగానే ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. రూట్కు బంతినప్పగించగా .. నాలుగో బంతికే రూట్ వికెట్ తీసి భారత్ను దెబ్బకొట్టాడు.
ఓవర్ నైట్ స్కోరు 119-1 వద్ద భారత్ రెండో రోజు ఆరంభించింది. నిన్ననే అర్థ సెంచరీ పూర్తిచేసుకుని (76) సెంచరీ దిశగా సాగిన జైస్వాల్.. రూట్ వేసిన తొలి ఓవర్ (భారత్ ఇన్నింగ్స్లో 24వ ఓవర్) రెండో బంతికే బౌండరీ కొట్టాడు. కానీ అదే ఓవర్లో నాలుగో బంతికి నేరుగా అతడికే క్యాచ్ ఇచ్చాడు. నిన్న మ్యాచ్ ముగిశాక అనిల్ కుంబ్లే చెప్పిన ట్రిక్ (రూట్కు బౌలింగ్ ఇవ్వక ఇంగ్లండ్ తప్పుచేసింది అని కామెంట్ చేశాడు) ను ఫాలో అయ్యాడో లేక పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని ముందునుంచే స్పిన్ ఉచ్చును బిగిద్దామనుకున్నాడో గానీ ఫలితాన్ని అయితే రాబట్టాడు.
Yashasvi Jaiswal’s quick fire knock 80(74), 10*4s, 3*6s comes to an end
Well played Champ 👏
Joe root got him#INDvsENG | #INDvENG pic.twitter.com/qwkxqu0Lrm
— Don Cricket 🏏 (@doncricket_) January 26, 2024
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లు (జాక్ లీచ్, టామ్ హర్ట్లీ, రిహాన్ అహ్మద్) లతో బరిలోకి దిగగా తాజాగా వారికి జో రూట్ కూడా జతకలిశాడు. దీంతో ఈరోజు మొత్తం ఈ నలుగురితోనే స్టోక్స్ సేన దాడి చేసే అవకాశముంది. 29 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ భారత్.. రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ ( 15 నాటౌట్), శుభ్మన్ గిల్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉంది.