మిర్యాలగూడ, మే 9: పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆగ్రోస్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో హామీలన్నింటిని అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.కార్యక్రమంలో అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ యువనేత నల్లమోతు సిద్ధార్థ్ధ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మిర్యాలగూడ బంగారుగడ్డ 30వ వార్డులో కౌన్సిలర్ కుర్ర చైతన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో లింగంపల్లి చిరంజీవి, కంచరకుంట్ల దయాకర్రెడ్డి, నూనె రవి, లలిత, మణి, కృష్ణ, శివుడు, హరి, విజయ్, మల్లి, శివ పాల్గొన్నారు.
దామరచర్ల : తెలంగాణ అభివృద్ధ్ది, మనుగడ కేసీఆర్తోనే సాధ్యమవుతుందని రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు వీరకోటిరెడ్డి అన్నారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపుకోసం గురువారం మండల కేంద్రంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లగౌడ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, వీరబాబు, కొండారపు నాగేశ్వర్రావు, కానసాని సోమయ్య, బాల గుర్వయ్య పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే కలిగే ఇబ్బందులు తప్పవని ప్రజలకు వివరి స్తూ ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేసాని లింగారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులసీరాంనాయక్, వరికుప్పుల పాండు, ముశిని శేఖర్యాదవ్, రమావత్ జవహర్లాల్, రమావత్ కోటేశ్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు గురువారం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించారు. బుద్దారం గ్రామంలో మాజీ జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికీ బ్యాలెట్ నమూనాను చూపుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ సర్పంచులు నారబోయిన నర్సింహ, గుండెబోయిన శ్రీలతాజంగయ్య, సురిగి మణేమ్మారమేశ్, కోట్ల రమాదేవీజయపాల్రెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణు లు గురువారం చందపట్ల, మంగళపల్లి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సందినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. కార్యక్రమాలలో పార్టీ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, ఎంపీటీసీ ఇమడపాక లక్ష్మీ వెంకన్న, బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ గోనె నరసింహారావు, నాయకులు వనం చందర్రావు, మాచర్ల సుధాకర్, చింతమల్ల శ్రీను, సుదర్శన్, తండు సత్తయ్య, జిల్లా సంపత్ పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మునికుంట్ల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కొండభీమనపల్లి, ఎర్రబిచ్చతండా, బొల్లిగుట్టతండా, దౌరాజ్తండాల్లో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడారి సైదులు, గ్రామ శాఖ అధ్యక్షుడు కల్యాణ్నాయక్, పి.చందు, వెంకటేశ్ పాల్గొన్నారు.
చందంపేట : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కం చర్ల కృష్ణారెడ్డి గెలుపు కోరుతూ దేవరకొండలోని 9,10 వార్డుల్లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బీల్యానాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. గాజుల ఆంజనేయులు, జాఫర్ పాల్గొన్నారు.
చందంపేటమండలంలోని పోలేపల్లి, కాట్రావత్తండా, గన్నెర్లపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్గౌడ్, లోక్యనాయక్, శంకర్నాయక్, వెంకట్రెడ్డి, అందుగుల సైదులు, దామోదర్రెడ్డి, సత్యనారాయణ, బాలవర్దిరాజు, శివ, భాస్కర్, విష్ణుమూర్తి, రామస్వామి పాల్గొన్నారు.
నేరేడుగొమ్ము :మండలంలోని పలు గ్రామా ల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ ముక్కమల బాలయ్య, ఆరెకంటి రాములు, వెంకటయ్య, శ్రీనయ్య, ముత్యాలమ్మ పాల్గొన్నారు.
నల్లగొండ సిటీ : కనగల్ మండలం పర్వతగిరి, చిన్నమాదారం గ్రామాల్లో బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యం లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజ మ్మ రామచంద్రు, మాజీ చైర్మన్ యాదగిరి, చింతసైదులు, లక్ష్మణ్, చెన్నగోని సైదులు, బొ మ్మగాని శంకర్, శ్రీశైలం, యాదగిరి ఉన్నారు.
గుర్రంపోడ్ : మండలంలోని షాకాజీపురం,గుర్రంపోడ్ గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఆయన వెంట కుప్ప పృథ్వీరాజ్ గౌడ్, కునూరు సైదిరెడ్డి, వేముల యాదయ్య ఉన్నారు.
మాడ్గులపల్లి : కంచర్ల కృష్ణారెడ్డికి మ ద్దతు గా మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇం టింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో వెన్న శ్రవణ్రెడ్డి, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
హాలియా : హాలియా రెండో వార్డులో మున్సిపల్ కోప్షన్ సభ్యుడు చాపల సైదులు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వడ్డె సతీశ్రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.