జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లి 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కర్నూల్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం స్టేజీ వద్ద అదుపుతప్పి గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు పెంపకందారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.