తరౌబా (ట్రినిడాడ్): ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-2తో విండీస్ కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన పోరులో తొలుత ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు కుప్పకూలింది. ఫిల్ సాల్ట్ (38), లివింగ్ స్టోన్ (28), మొయిన్ అలీ (23) రాణించారు.
కరీబియన్ బౌలర్లలో గుడాకేశ్ మోతీ మూడు, ఆండ్రీ రసెల్, అకీల్ హొస్సేన్, జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు పడగొడ్డారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 133 పరుగులు చేసింది. హోప్(43 నాటౌట్), రూథర్ఫర్డ్(30) విజయంలో కీలకంగా వ్యవహరించారు. మోతీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఫిల్ సాల్ట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.