న్యూఢిల్లీ: ఆసియాకప్(Asia Cup)ను శ్రీలంకలో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీని పాకిస్థాన్ నుంచి తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆ దేశం తప్పుపట్టింది. ఒకవేళ తమ ప్రతిపాదనలను ఆమోదించకుంటే, ఆ టోర్నీని బహిష్కరించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ అధికారులు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు వెల్లడించారు. ఆసియా కప్ నిర్వహణ గురించి దుబాయ్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులతో పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ నాజమ్ సేథీ భేటీ అయ్యారు. యూఏఈ నుంచి శ్రీలంకకు ఆసియాకప్ను తరలించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
2018, 2022లో యూఏఈలోనే ఆసియాకప్ను నిర్వహించారని, అదే మాదిరిగా ఇప్పుడు కూడా నిర్వహించాలన్న అంశంపై కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సేథీ తెలిపారు. వెనుక నుంచి బీసీసీఐ సపోర్టు ఇవ్వడం వల్లనే శ్రీలంక బోర్డు ఆసియా కప్ నిర్వహణకు ఆసక్తి చూపుతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ఆరోపించింది.