దుబాయ్ : ఐసీసీ తప్పిదంతో టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కొన్ని గంటలపాటు నంబర్వన్ స్థానంలో నిలిచింది. బుధవారం తొలుత విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానం సాధించిందని తెలపడంతో మూడు ఫార్మాట్లలో నంబర్వన్ స్థానం దక్కించుకున్నట్టయింది. అయితే సాయంత్రానికి స్థానాలు తారుమారయ్యాయి.
నాగపూర్లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల విజయంతో టీమిండియా 115 ర్యాంకింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. ఆస్ట్రేలియా ఇప్పటికే 126 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా నంబర్వన్ స్థానానికి చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల సిరీస్ను 3-1 లేదా 3-0తో నెగ్గాల్సి ఉంది.