దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి అభిమానులను అలరించనున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 28న మొదలయ్యే ఈ మెగా టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం ప్రకటించింది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 13 వరకు ఎనిమిది జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.
28న ఆరంభ మ్యాచ్లో హాంకాంగ్, థాయ్లాండ్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్-ఎలో ఏడుసార్లు చాంపియన్ భారత్తో పాటు పాక్, థాయ్లాండ్, హాంకాంగ్, చైనా ఉండగా.. డిఫెండింగ్ చాంప్ శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచే జట్లు సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్కు చేరుతాయి. సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతుంది.