– మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ తిరుపతిరెడ్డి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 19 : అన్నం పరబ్రహ్మ స్వరూపం వంటిదని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం నాయుడుపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కమిషనర్, ఏసిపి, సీఐలు ముష్కరాజ్, సంజీవ్ హాజరయ్యారు. తొలుత గణేష్ మండపంలో సిద్ధి వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండటం అలవర్చుకోవాలన్నారు. అన్నదానం వంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకునే విధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చొరవ తీసుకోవాలని, విజయవంతం చేసే విధంగా ప్రజలు సహకరించాలని వారు సూచించారు. క్రమంలో పలువురు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.