T20 World Cup 2022: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. లంకపై గెలుపు ద్వారా ఇంగ్లండ్ గ్రూప్-1 నుంచి సెమీస్లో అడుగుపెట్టింది. గ్రూప్-1 లో అగ్రస్థానంలో నిలిచి న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకోగా.. తాజా గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్లో రెండో స్థానానికి చేరి సెమీస్లో కాలుమోపింది.
కాగా, లంకపై ఇంగ్లండ్ జట్టు విజయంతో ఆస్ట్రేలియా జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఒకవేళ ఇంగ్లండ్పై లంక జట్టు గెలిచి ఉంటే మ్యాచ్ పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా సెమీస్కు వెళ్లేది. కానీ ఇంగ్లండ్ గెలువడంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలా ఏడు పాయింట్లతో సమంగా నిలిచాయి.
న్యూజిలాండ్ 2.113 రన్రేట్తో ఫస్ట్ప్లేస్తో సెమీస్కు వెళ్లింది. ఇక ఇంగ్లండ్ టీమ్ 0.473 నెట్ రన్రేట్తో మైనస్ రన్రేట్ ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ ఆడే అవకాశం దక్కించుకుంది. కాగా, ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తర్వాత ఇంగ్లండ్ జట్టు కేవలం 6 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.