మహిళల క్రికెట్కు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వంటి బోర్డులు మహిళా క్రికటె్పై మరింత ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఐసీసీ వార్షిక మీటింగ్లో 2024 నుంచి 2027 మధ్య మహిళల క్రికెట్ కీలక టోర్నీలు నిర్వహించే వేదికలను ఖరారు చేశారు.
2024లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్ గెలుచుకోగా.. 2026 టీ20 ప్రపంచకప్ హక్కులను ఇంగ్లండ్ దక్కించుకుంది. అదే సమయంలో 2025 వన్డే ప్రపంచకప్ హక్కులను బీసీసీఐ సొంతం చేసుకోగా.. 2027 టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను శ్రీలంక పొందింది.
ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 2025 వన్డే ప్రపంచకప్ నిర్వహించాలని తాము చాలా బలంగా అనుకున్నామని, ఇప్పుడు ఆ హక్కులు తమకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఆయా క్రికెట్ బోర్డులు కూడా ఆతిథ్య హక్కులు దక్కినందుకు హర్షం వ్యక్తంచేశాయి.
The hosts for the ICC Women's tournaments between 2024-2027 have now been confirmed 🤩
Details 👇https://t.co/Auw0YAMRLD
— ICC (@ICC) July 26, 2022