ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్(ODI World Cup) సమరానికి మరో 12 రోజులు ఉందంతే. ఇప్పటికే అన్ని జట్లు 15 మంది స్క్వాడ్ను ప్రకటించాయి. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ(Prize Money)ని ప్రకటించింది. ఈసారి 10 లక్షల డాలర్లను కేటాయించినట్టు ఐసీసీ తెలిపింది. ట్రోఫీ విజేతకు 4 లక్షల డాలర్లు అంటే రూ. 33 కోట్లు, రన్నరప్ జట్టుకు 2 లక్షల డాలర్లు అంటే రూ. 16.5 కోట్లు కానుకగా దక్కనున్నాయి.
సెమీఫైనల్లో ఓడిపోయిన రెండు టీమ్లకు తలా రూ. 13 కోట్లు ముడతాయని ఐసీసీ తెలిపింది. సూపర్ 6 దశలోనే ఇంటిదారి పట్టిన జట్లకు రూ.4.9 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాదు గ్రూప్ దశలో గెలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. గ్రూప్ స్టేజ్లో గెలిచిన ఒక్కో మ్యాచ్కు రూ.33 లక్షలు లభిస్తాయని ఐసీసీ వెల్లడించింది. 2019లో చాంపియన్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ. 39 కోట్లు ప్రైజ్మనీగా దక్కాయి.
The total prize pool for #CWC23, including the cash prize for the winners, has been announced 💰
Details 👇
— ICC (@ICC) September 22, 2023
అక్టోబర్ 5న భారత గడ్డపై వన్డే ప్రపంచ కప్ మొదలవ్వనుంది. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలు కూడా సుందరంగా ముస్తాబయ్యాయి. అక్టోబర్ 7 న భారత జట్టు ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. దాయాదుల సమరం అక్టోబర్ 14న అహ్మదాబాద్లో జరుగనుంది. రౌండ్ రాబిన్ పద్దతిలో 10 టీమ్లు ఒక్కో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఈసారి ఫైనల్తో పాటు సెమీఫైనల్ మ్యాచ్లకు కూడా రిజర్వ్ డే కేటాయించిన విషయం తెలిసిందే.