డర్హం: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ నెట్స్లో చెమటోడ్చగా.. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే తమ బ్యాట్లకు పనిచెప్పారు. ‘ఇంగ్లండ్తో సుదీర్ఘ టెస్టు సిరీస్కు ముందు భారత ఆటగాళ్లు డర్హం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ ప్రారంభించారు’ అని బీసీసీఐ ట్విట్టర్లో పేర్కొంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ అనంతరం జట్టు సభ్యులంతా కలిసి ఫీల్డింగ్ సాధన చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలోను బీసీసీఐ ట్వీట్ చేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య వచ్చే నెల 4 నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న విషయం తెలిసిందే.