శ్రీలంక చేతిలో కూడా ఓడిపోవడంతో ఆసియా కప్ టోర్నీ నుంచి భారత్ దాదాపు అవుటైనట్లే. అయితే అధికారికంగా మాత్రం టీమిండియాకు ఇంకా అవకాశం ఉంది. ఈ టోర్నీలో గ్రూప్ దశలో రెండు మ్యాచులు గెలిచి సూపర్-4లో చోటు దక్కించుకున్న భారత్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఒత్తిడిలో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో పాకిస్తాన్ చేతిలో, ఆ తర్వాత శ్రీలంక చేతిలో పరాజయాలు చవిచూసింది. దీంతో ఆ జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశాలు గల్లంతయ్యాయి. అయితే అఫీషియల్గా చూసుకుంటే భారత్కు ఇంకా ఆసియా కప్ ఫైనల్ చేరే అవకాశం ఉంది. అది ఎలాగంటే.. బుధవారం జరిగే మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాలి.
అదే సమయంలో గురువారం మ్యాచ్లో అఫ్ఘాన్ను టీమిండియా ఓడించాలి. అంతేకాక ఆ తర్వాత శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాలి. అప్పుడు కూడా పాక్, అఫ్ఘాన్ కంటే భారత నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పాక్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే అఫ్ఘాన్, శ్రీలంక చేతిలో ఆ జట్టు ఓడిపోవడం అసాధ్యమనే చెప్పొచ్చు. ఈ రెండింట్లో పాక్ ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా శ్రీలంక, పాకిస్తాన్ ఫైనల్ చేరతాయి.
Hoping for the best, ready for the worst 🤞🏻#INDvSL #AsiaCupT20 #TeamIndia pic.twitter.com/yRqWCsZgN4
— Sportskeeda (@Sportskeeda) September 6, 2022