Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)కు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ(ram lalla pran prathishta) ఆహ్వానం అందింది. రామాలయ ట్రస్ట్ సభ్యులు ముంబైలో కౌర్కు ఇన్విటేషన్ అందించారు. దాంతో, టీమిండియా కెప్టెన్ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడకను కండ్లారా చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది అని కౌర్ తెలిపింది.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం(Lord Rama Temple) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు కౌంట్డౌన్ మొదలైంది. రెండు రోజులే ఉండడంతో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. క్రికెటర్లలో మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో పాటు ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)లకు ఇన్విటేషన్ ముట్టింది.
Harmanpreet Kaur has received the invitation for Ram Temple Pran Pratishtha at Ayodhya. pic.twitter.com/pY4UNZoOeU
— Johns. (@CricCrazyJohns) January 20, 2024
రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడకకు రామాలయ ట్రస్ట్ 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది. వీళ్లలో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీళ్లలో మాజీ సివిల్ సర్వీసెంట్లు, ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, ఇంద్రజాలికులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డు విజేతలు ఉన్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది.