తిరుచిరాపల్లి : ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆయలంలో ఆయన పూజలు చేయనున్నారు. ఆ తర్వాత ఆయన రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ కూడా ఆయన ప్రత్యేక పూజలో పాల్గొననున్నారు. శ్రీరంగం స్కాలర్స్ పాడనున్న కంబ రామాయణం భజనలను ఆయన ఆలకించనున్నారు. మధ్యాహ్నం రామేశ్వరం చేరుకుంటా. దర్శన, అభిషేక పూజలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా శ్రీరంగం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ సందర్భంగా.. ప్రధాని మోదీ పలు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు.
#WATCH | Tamil Nadu: Priests of Sri Ranganathaswamy Temple, in Tiruchirappalli prepare to welcome Prime Minister Narendra Modi ahead of his visit to the temple. pic.twitter.com/FTwUgtKCJ3
— ANI (@ANI) January 20, 2024