కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి టాప్-2లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ సెమీస్కు అర్హత సాధించగా గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేరాయి. ఇక సెమీఫైనల్లో భారత జట్టు.. ఇంగ్లండ్ను ఢీ కొనబోతున్నది.
ఈ పోటీలలో స్వర్ణం గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు.. ఆ క్రమంలో ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడారు. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి పుంజుకున్నారు. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బార్బడోస్నూ ఓడించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.
మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ టోర్నీలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో బ్రిటీష్ అమ్మాయిలు.. శ్రీలంక, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్-బిలో టాపర్గా నిలిచారు. తద్వారా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన భారత్తో తలపడనున్నారు. శనివారం (ఆగస్టు 6) భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి సెమీస్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇక రేపు రాత్రి 10.30 గంటల నుంచి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ రెండో సెమీస్లో తలపడతాయి.
సెమీస్ విజేతలు ఆదివారం ఫైనల్లో స్వర్ణం, రజతం కోసం పోటీ పడతాయి. ఓడిన రెండు జట్లు కాంస్యం కోసం మరో మ్యాచ్ ఆడనున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లండ్ జట్టు సారథి హీథర్ నైట్ గాయం కారణంగా మొత్తం టోర్నీ నుంచే తప్పుకుంది. ఆమె స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన నటాలీ స్కివెర్ వరుస విజయాలతో జట్టును సెమీస్ చేర్చింది.
We will play in the first semi-final on Saturday, getting underway at 11am (UK time) against India! pic.twitter.com/fSMj5xIxFw
— England Cricket (@englandcricket) August 5, 2022