భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది. సెప్టెంబర్ నెల కోసం ఇచ్చిన ఈ అవార్డుల్లో పురుషుల విభాగంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్కు కూడా అవార్డు దక్కింది. ఇంగ్లండ్లో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించిన హర్మన్ప్రీత్ కౌర్.. ఈ అవార్డు తన ఖాతాలో వేసుకుంది.
ఈ క్రమంలో మరో భారత స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధాన, బంగ్లాదేశ్ జట్టు సారధి నిగర్ సుల్తానాలను వెనక్కునెట్టి అవార్డు అందుకుంది. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. ‘ఈ అవార్డుకు నామినేట్ అవ్వడమే గొప్ప విషయం. అలాంటిది నాకు అవార్డు దక్కడంతో చాలా సంతోషంగా ఉంది.
స్మృతి, నిగర్తో జరిగిన పోటీలో గెలవడం గొప్ప ఫీలింగ్’ అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది. పురుషుల విభాగంలో పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వీరిలో రిజ్వాన్ను అవార్డు వరించింది.
A dashing captain has won the ICC Women’s Player of the Month for September 2022 🌟
More 👇
— ICC (@ICC) October 10, 2022
A top T20I batter has become the ICC Men’s Player of the Month for September 2022 🔥
Details 👇
— ICC (@ICC) October 10, 2022