లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ టీమ్ నాయక ద్వయం హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన బరిలోకి దిగబోతున్నారు. గురువారం జరిగిన లీగ్ వేలంలో ట్రెంట్ రాకెట్స్ టీమ్కు హర్మన్ప్రీత్కౌర్, సదరన్ బ్రేవ్ జట్టుకు మందన ప్రాతినిధ్యం వహించనుంది.
ఇప్పటికే పురుషుల జట్లతో విజయవంతంగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నీలో తొలిసారి మహిళల వేలం పాట జరిగింది. వేలంలో పురుషుల, మహిళలు కలిపి మొత్తం 64మంది క్రికెటర్లను ఆయా జట్లు తమ సొంతం చేసుకున్నాయి. వెల్ష్ ఫైర్ తరఫున పాకిస్థాన్ క్రికెటర్లు షాహిన్షా అఫ్రీది, హరిస్ రవూఫ్ ఆడనుండగా, బాబర్ ఆజమ్, పొలార్డ్, బౌల్ట్ అన్సోల్డ్గా మిగిలిపోయారు. ఆగస్టు1 నుంచి హండ్రెడ్ టోర్నీ మొదలుకాబోతున్నది.