న్యూఢిల్లీ: విదేశీ లీగ్ల్లో పాల్గొనేందుకు పురుష క్రికెటర్లకు అనుమతులివ్వని బీసీసీఐ మహిళా క్రికెటర్లకు మాత్రం నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీచేసింది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్-జూలైలో జరుగనున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో పాల్గొనడానికి హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలకు బీసీసీఐ అనుమతినిచ్చింది. షెడ్యూల్ ప్రకారం గతేడాదే ప్రారంభం కావాల్సిన ఈ లీగ్ కొవిడ్-19 కారణంగా వాయిదా పడతూ వస్తున్నది. ఇది వంద బంతుల టోర్నీ కాగా.. ఈ లీగ్లో ప్రముఖ ఆటగాళ్లు (పురుషులు, మహిళలు) పాల్గొననున్నారు.