న్యూఢిల్లీ: ఐపీఎల్లో మరో ఆసక్తికర బదిలీకి రంగం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్కు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ మొత్తానికి ఈ బదిలీ జరుగుతున్నట్లు ఐపీఎల్ వర్గాల వినికిడి. దీనిపై అటు గుజరాత్ గానీ, ముంబై ఫ్రాంచైజీ యజమాని నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.
ప్లేయర్ల బదిలీలకు ఆఖరి తేదీ అయిన ఈ నెల 26లోగా దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ముంబై తరఫున ఏడు సీజన్లు ఆడిన హార్దిక్..2022లో గుజరాత్కు మారాడు. అరంగేట్రం సీజన్లోనే గుజరాత్ను విజేతగా నిలిపిన సంగతి తెలసిందే.