ఢిల్లీ : సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో ఫేవరేట్ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ.. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలుపొందిన భారత జట్టుకు పెద్ద షాక్. గాయం నుంచి కోలుకోని వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్తో కీలక పోరుకు దూరం కానున్నాడు. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న ఈ ఆల్రౌండర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. బంగ్లాదేశ్తో గురువారం పుణెలో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ.. బంతిని ఆపబోయిన పాండ్యా ఎడమ కాలికి దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడిన అతడికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు పాండ్యాను ఎన్సీఏకు తరలించాం. అక్కడ బీసీసీఐ వైద్య బృందం పాండ్యా ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనుంది. అందుకని అతడు శుక్రవారం జట్టుతో కలిసి ధర్మశాలకు వెళ్లలేదు. పాండ్యా నేరుగా అక్టోబర్ 29న ఇంగ్లండ్ మ్యాచ్కు వేదికైన లక్నోలో టీమ్ఇండియాతో కలుస్తాడు అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.