WPL 2024: మరికొద్దిరోజుల్లో ఢిల్లీ, బెంగళూరు వేదికలుగా జరుగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ ఆధ్వర్యంలోని గుజరాత్ జెయింట్స్ జట్టు కొత్త హెడ్కోచ్తో బరిలోకి దిగబోతోంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖెల్ క్లింగర్కు ఆ జట్టు హెడ్కోచ్ బాధ్యతలు అప్పజెప్పింది. గత సీజన్లో గుజరాత్ జెయింట్స్కు రేచల్ హేన్స్ హెడ్కోచ్గా వ్యవహరించింది. కానీ గత సీజన్లో ఆ జట్టు దారుణ వైఫల్యాలతో పాయింట్లపట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం విదితమే.
ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున అవకాశాలు దక్కించుకోకపోయినా దేశవాళీ క్రికెట్లో మాత్రం పరుగుల వరద పారించాడు. 182 ఫస్ట్ క్లాస్ గేమ్స్లో క్లింగర్.. 11,320 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 7,449 పరుగులు చేయగా, టీ20 కెరీర్లో 5,960 రన్స్ చేశాడు. జాతీయ జట్టు తరఫున అవకాశాలు దక్కించుకోలేకపోయిన క్లింగర్.. ఆసీస్ తరఫున మూడు టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
Ahead of WPL 2024, Michael Klinger joins as the Head Coach for Gujarat Giants.#CricketTwitter #WPL2024 pic.twitter.com/b0PEJ6IX9G
— Female Cricket (@imfemalecricket) February 6, 2024
అంతర్జాతీయ క్రికెట్లో అంతగా పరిచయం లేని క్లింగర్.. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో మెల్బోర్న్ రెనెగ్రేడ్స్ కు రెండు సీజన్ల పాటు హెడ్కోచ్గా వ్యవహరించాడు. అంతకుముందు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్కు అసిస్టెంట్ కోచ్గా పనిచేశాడు. హెడ్కోచ్గా క్లింగర్ బాధ్యతలు చేపట్టబోతున్న గుజరాత్ జెయింట్స్ జట్టుకు మెంటార్గా మిథాలీ రాజ్ ఉండగా నూషిమ్ అల్ ఖాదిల్ బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే. గుజరాత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 25న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో ఆడనుంది.