గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తడబడింది. మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (43), ఇషాన్ కిషన్ (45) ఇద్దరూ అదిరిపోయే ఆరంభం అందించారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) అనూహ్యంగా విఫలమయ్యాడు.
క్రీజులో కుదురుకోవడానికి నానా తిప్పలు పడిన కీరన్ పొలార్డ్ (4) పూర్తిగా నిరాశపరిచాడు. చివర్లో టిమ్ డేవిడ్ (44 నాటౌట్)తో కలిసి ఆడిన తిలక్ వర్మ (21) రనౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ తీసుకున్నారు.
Innings Break! @rashidkhan_19 was the pick of the @gujarat_titans bowlers. 👌 👌@mipaltan put on a solid show with the bat & posted 177/6 on the board. 👏 👏
The #GT chase to begin shortly. 👍 👍
Scorecard ▶️ https://t.co/2bqbwTHMRS #TATAIPL | #GTvMI pic.twitter.com/QxCIisugXZ
— IndianPremierLeague (@IPL) May 6, 2022