Gautam Gambhir : భారత ఆటగాళ్లపై మాటల తూటాలు పేల్చే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా..? అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు వీడ్కోలు పలికిన గౌతీ విదేశీ లీగ్స్లో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. అమెరికాలో జరుగుతున్న మాస్టర్స్ టీ10 టోర్నమెంట్(Masters T10)లో ఈ స్టార్ ఆటగాడు పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్నాడు. న్యూ జెర్సీ ట్రిటాన్స్(New Jersey Tritans) జట్టు తరఫున ఆడుతున్న గంభీర్ ఈరోజు గోల్డెన్ డక్(Golden Duck)గా వెనుదిరిగాడు.
మొదట బ్యాటింగ్ చేసిన అట్లాంటా రైడర్స్(Atlanta Riders) 10 ఓవర్లకు 102 రన్స్ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో పేసర్ కమ్రుల్ ఇస్లాం రబ్బీ వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే గంభీర్ ఎల్బీగా ఔటయ్యాడు. ఈ టోర్నీలో మరోసారి సున్నాకే పెవిలియన్ చేరి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 3 మాత్రమే. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మెంటార్గా సేవలందిస్తున్నాడు.
అట్లాంటా రైడర్స్, న్యూ జెర్సీ ట్రిటాన్స్ మ్యాచ్ వీడియో
టీమిండియా గొప్ప ఓపెనర్లలో గంభీర్ ఒకడు. 2011లో భారత జట్ట వరల్డ్ కప్ ట్రోఫీ అందుకోవడంలో అతడి పాత్ర ఎంతో ఉంది. 274 పరుగుల ఛేదనలో సచిన్, సెహ్వాగ్ ఔటయ్యాక గంభీర్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆ తర్వాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(91 నాటౌట్)తో జట్టును విజయంవైపు నడిపించాడు.
ధోనీ(91 నాటౌట్), గంభీర్ (97)
ధాటిగా ఆడిన గౌతీ(97 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్లో యువరాజ్ సింగ్ కంటే ముందొచ్చిన ధోనీ సంచలన ఆటతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. కులశేఖర బౌలింగ్లో సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. దాంతో, 28 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్లీ వరల్డ్ కప్ ట్రోఫీని దక్కించుకుంది.