Sourav Ganguly : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) పోటీలకు సమయం దగ్గరపడుతోంది. భారత గడ్డపై 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై బీసీసీఐ(BCCI) దృష్టి పెట్టింది. అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు కూడా టోర్నీని విజయవంతం చేయానే పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) కొత్త బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన, పనుల వేగవంతం మీద అతను ఫోకస్ చేయనున్నాడు.
తాజాగా బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్(Cricket Association of Bengal) 12 మందితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో దాదా ఒకడు. ‘ఈడెన్స్లో పనులు చకచకా జరుగుతున్నాయి. నిర్ణీత సమయంలోపు స్టేడియం సుందరీకరణ, ఇతర పనులన్నీ పూర్తవుతాయి’ అని గంగూలీ వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న గంగూలీ
‘వరల్డ్ కప్ కోసం 12 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. ఐపీఎల్(IPL) నిర్వహణ మండలిలో సభ్యులైన గంగూలీ, అభిషేక్లు ఇందులో ఉన్నారు. మేమంతా కలిసి ఈ గొప్ప యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాం’ అని ప్రస్తుత అధ్యక్షుడు స్నేహాంశిష్ గంగోపాధ్యాయ(Snehashis Gangopadhyay) ఓ ప్రకటనలో తెలిపాడు. ఈ కమిటీలో క్యాబ్ మాజీ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా(Abhishek Dalmiya), ప్రస్తుత అధ్యక్షుడు స్నేహాంశిష్తో పాటు మరో ఐదుగురు క్యాబ్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈడెన్ గార్డెన్స్లో ఐదు వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగనున్నాయి. నాలుగు లీగ్ మ్యాచ్లతో సహా కీలకమైన సెమీఫైనల్కు ఈ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
సొంత గడ్డపై అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్తో వరల్డ్ కప్ ఆరంభం కానుంది. 2011లో ట్రోఫీని ముద్దాడిన భారత్ మరోసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉండడం టీమిండియాకు కొండంత బలం. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ రాకతో బౌలింగ్ యూనిట్ కూడా దృఢంగా మారింది.