యాదగిరిగుట్ట రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో గజ్వేల్ విజేతగా నిలిచింది. గురువారం ఫైనల్లో తొలుత యాదగిరిగుట్ట జట్టు 15 ఓవర్లలో 120 పరుగులు చేయగా, గజ్వేల్ 14.4 ఓవర్లలో 121 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విజేతగా నిలిచిన గజ్వేల్కు 1.50లక్షలు, రన్నరప్నకు లక్ష అందజేశారు.
ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా సాట్స్ చైర్మన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్లేయర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నీలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు.