Rohit Sharma | భారత క్రికెట్ జట్టు అభిమానులకు చేదువార్త. దేశవాళీ క్రికెట్లో రాజస్తాన్ తరఫున ఆడిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోహిత్.. ఆదివారం తుదిశ్వాస విడిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్తో పాటు లెగ్ స్పిన్నర్ అయిన రోహిత్.. రాజస్తాన్ తరఫున 2004 నుంచి 2014 దాకా డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. 2004లో రాజస్తాన్ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతూ ఎంట్రీ ఇచ్చిన అతడు.. 2014లో విజయ్హజారే ట్రోఫీలో మ్యాచ్ ఆడి వీడ్కోలు పలికాడు.
రాజస్తాన్ తరఫున రోహిత్.. 7 ఫస్ట్క్లాస్ గేమ్స్, 28 లిస్ట్ ఏ గేమ్స్, నాలుగు టీ20లు ఆడాడు. దేశవాళీలో 1147 పరుగులు చేసిన అతడు.. ఏడు వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రోహిత్.. కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. అతడు జైపూర్లో ఆర్ఎస్ క్రికెట్ అకాడమీని నెలకొల్పాడు. తన క్రికెట్ అకాడమీలో యువ క్రికెటర్లకు క్రికెట్ పాఠాలు చెబుతూ గడుపుతున్నాడు.
Rajasthan cricketer Rohit Sharma passed away last night
Unfortunately, the day and age we live in, these haters and trollers are now making it like the popular namesake has passed away… Can already see the tweets! Pathetic…
— Vinesh Bhai (@vlp1994) March 2, 2024