కరాచీ: పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్ అయోమయంలో పడింది. వెస్టిండీస్ టీమ్లో అయిదుగురికి కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో వాళ్లంతా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు, ఇద్దరు కోచింగ్ స్టాఫ్ ఉన్నారు. బ్యాటర్ షాహి హోప్, స్పిన్నర్ అకీల్ హుసేన్, ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్కు కరోనా సోకింది. వీరితోపాటు అసిస్టెంట్ కోచ్ రొడ్డి ఎస్ట్విక్, టీమ్ ఫిజీషియన్ డాక్టర్ అక్సాయి మాన్సింగ్లు కూడా కరోనా వైరస్ సంక్రమించింది.
ప్రస్తుతం రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్లు జరుగుతున్నాయి. వెస్టిండీస్ జట్టుకు దూరంగా కరోనా సోకిన ఆటగాళ్లు ఐసోలేషన్లో ఉండనున్నారు. ఆ ఆటగాళ్లకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు చెప్పింది. పది రోజుల పాటు ప్లేయర్లు ఐసోలేషన్లో ఉంటారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ వస్తేనే మళ్లీ జట్టుతో కలుస్తారు. ఇప్పటికే విండీస్ జట్టులోకి ఆరుగురు ప్లేయర్లకు కరోనా సోకింది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు సిరీస్ నిర్వహణపై ఇవాళ సమావేశం కానున్నారు.
మిగితా మ్యాచ్లను నిర్వహించాలా వద్దా అని దానిపై నిర్ణయం తీసుకోన్నారు. షెల్డన్ కాట్రల్, రోస్టన్ ఛేజ్, కైల్ మేయర్స్లు ఇప్పటికే పాజిటివ్ రావడంతో సిరీస్ నుంచి ఔటయ్యారు. ఇవాళ రెండు దేశాల మధ్య మూడవ టీ20 మ్యాచ్ జరగనున్నది. ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకున్నది. శనివారం నుంచి మూడు వన్డేలు ప్రారంభంకానున్నాయి.