Joginder Sharma : టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్ శర్మ (Joginder Sharma) చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీ(DSP)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శర్మ ఒక సూసైడ్ కేసు (Suicide Case)లో ఇరుక్కున్నాడు. హిసార్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఈ మాజీ క్రికెటర్పై ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. దాంతో, శర్మ ఈ కేసు నుంచి బయటపడతాడా? లేదా దోషిగా తేలుతాడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
కొత్త సంవత్సరంలో మొదటి రోజునే హిసార్లోని దళిత కుటుంబానికి చెందిన పవన్ అనే వ్యక్తి ఉరివేసుకొని మరణించాడు. ఆస్తి వివాదాల కారణంగానే అతడు బలవర్మరణానికి పాల్పడ్డానే వార్తలు వినిపించాయి. అయితే.. అతడి కుటుంబం మాత్రం రాహుల్ ఆత్మహత్య వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపించారు.
జోగిందర్ శర్మ
ఈ క్రమంలోనే రాహుల్ తల్లి.. ‘జోగిందర్ శర్మ, హాకీ కోచ్ రాజేంద్ర సింగ్, అజవీర్, ఈశ్వర్ జజారియా, ప్రేమ్ ఖటి, అర్జున్లు తీవ్రంగా వేధించారు. దాంతో, అతడు ఆత్మహత్మ చేసుకున్నాడు’ అని కంప్లైంట్లో తెలిపింది. దాంతో, నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్లో మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) సేన చాంపియన్గా అవతరించింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో పాకిస్థాన్ను 5 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మ మూడో బంతికే ప్రమాదకరమైన మిస్బావుల్ హక్(Misbah Ul Haq)ను ఔట్ చేశాడు.
పొట్టి ప్రపంచకప్ ట్రోఫీతో ధోనీ సేన
ఫైన్లెగ్లో మిస్బా ఆడిన బంతిని శ్రీశాంత్(Sreeshanth) అందుకోవడంతో భారత డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్ శర్మకు హర్యానా ప్రభుత్వం పోలీస్ జాబ్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు డీఎస్పీ హోదాలో ఉన్నాడు.