లండన్: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat kohli ) ఇన్స్టాగ్రామ్లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న భారతీయుడు. అతడు అందులో ఏ పోస్ట్ చేసినా దానికి ఓ విలువ ఉంటుంది. ఆర్థికంగా ఈ పోస్టులు విరాట్కు కోట్లు కురిపించేవి కాగా.. తనను ఫాలో అయ్యే ఎంతో మంది అభిమానుల్లో ఇవి ఆసక్తి రేపుతాయి. అలాంటి ప్లేయర్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ఒలింపియన్లకు సంబంధించిన పోస్ట్ అది.
వాట్ ఎ రికార్డ్. 10 శాతం మంది ఇండియన్ ఒలింపియన్లు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్లేనట. ఈ ఎల్పీయూ ఇండియన్ క్రికెట్ టీమ్కు కూడా తన స్టూడెంట్స్ను పంపిస్తుందని భావిస్తున్నా అని కోహ్లి ఆ పోస్ట్లో కామెంట్ చేశాడు. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఇండియన్ అథ్లెట్లు మన్ప్రీత్ సింగ్, నీరజ్ చోప్రా, నిషాద్ కుమార్, అమోజ్ జాకబ్, మణ్దీప్ సింగ్, భజరంగ్ పూనియా, వరుణ్ కుమార్లు ఈ ఎల్పీయూ నుంచి వచ్చిన వాళ్లే.
వీళ్లను ఉద్దేశించే విరాట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. అయితే అది కాస్త రివర్స్ అయింది. ఇది చూసి అభిమానులు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విరాట్ ఏంటి ఇలాంటి పోస్ట్ చేయడమేంటని కొందరు కామెంట్స్ చేశారు. అయితే కోహ్లి చేసిన ప్రమోషనల్ పోస్ట్లాగా ఇది కనిపిస్తున్నా.. అదేదో పెయిడ్ పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు కదా అని కూడా కొందరు అనడం విశేషం.