అడిలైడ్: టీ20 వరల్డ్కప్లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఇంగ్లండ్ ఓపెనర్లు వీరబాదుడుకు.. భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఇవాళ అడిలైడ్లో జరిగిన టీ20 వరల్డ్కప్ రెండవ సెమీస్లో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఇండియాపై జయభేరి మోగించింది. దీంతో ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్తో ఇంగ్లండ్ తలపడనున్నది.
The highest partnership in #T20WorldCup history inspires England to a stunning win over India in the semi-finals in Adelaide 😍#INDvENG | 📝: https://t.co/PgKzpNrdvB pic.twitter.com/F9nyZpHdSg
— ICC (@ICC) November 10, 2022
ఇండియా విసిరిన 169 రన్స్ టార్గెట్ను ఇంగ్లండ్ ఈజీగా చేజ్ చేసింది. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్లు ఇండియన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరు ఓపెనర్లు భారీ షాట్లతో అలరించారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ ఇండియన్ బౌలింగ్ అటాక్ను నీరుగార్చారు. హేల్స్ 86, బట్లర్ 80 రన్స్తో నాటౌట్గా నిలిచారు. 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 రన్స్ చేసింది ఇంగ్లండ్.
అంతకుముందు ఇండియా అతికష్టంగా 168 రన్స్ చేసింది. కోహ్లీ, పాండ్యాలు హాఫ్ సెంచరీలు చేశారు. కానీ కీలకమైన పవర్ప్లేలో పరుగులు రాబట్టడంలో ఇండియన్ బ్యాటర్లు విఫలం అయ్యారు. కోహ్లీ 50, పాండ్యా 63 రన్స్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఎక్కడా ఇండియన్ బ్యాటర్లకు ఛాన్స్ ఇవ్వలేదు.
To the MCG in style 🤩
England make it to their second Men's #T20WorldCup final in three editions 🙌 #INDvENG pic.twitter.com/llz20I6nRe
— ICC (@ICC) November 10, 2022